ముంబై: ఇండియన్ టీమ్ క్రికెటర్లు టీ నటరజాన్, శార్దూల్ ఠాకూర్లకు మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా గిఫ్ట్గా పంపిన థార్ కార్లు అందాయి. వీటి ముందు దిగిన ఫొటోలను ఈ ఇద్దరు క్రికెటర్లు ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా టూర్లో ఈ ఇద్దరి ప్రదర్శనకు మెచ్చిన ఆనంద్ మహీంద్రా.. తాను కార్లను గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరితోపాటు హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీలు కూడా ఈ కార్లు అందుకోనున్నారు.
తనకు వచ్చిన రెడ్ థార్ కారు ముందు భాగంలో తన జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇస్తూ ఫొటోలకు పోజిచ్చాడు నటరాజన్. ఆ జెర్సీని అతడు ఆనంద్ మహీంద్రాకు గిఫ్ట్గా పంపించడం విశేషం. అటు శార్దూల్ గ్రే కలర్ థార్ ముందు దిగిన ఫొటోలను షేర్ చేశాడు. తమకు ఈ ఖరీదైన కార్లను గిఫ్ట్గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రాకు వీళ్లు థ్యాంక్స్ చెప్పారు.
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?