ఎంజీకేఎల్ఐ కాల్వను పరిశీలించిన ఎమ్మెల్యే బీరం
కోడేరు, ఏప్రిల్ 2: ఎంజీకేఎల్ఐ ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని పసుపుల, కోడేరు, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలోని ఎంజీకేఎల్ఐ బ్రాంచి కాల్వను శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడేరు, పెద్దకొత్తపల్లి, పాన్గల్ పరిధిలోని అన్ని గ్రామాల రైతుల పొలాలకు సాగునీరందేలా రైతులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎంజీకేఎల్ఐ కాల్వలో ఎక్కువగా జమ్ము ఉండటం వల్ల నీళ్లు ముందకెళ్లడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే బీరం కాల్వలో జమ్మును తొలగించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఈఈ సంజీవరావు, జేఈ సందీప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ముత్తిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అంజల్గౌడ్, రైతులు ఉన్నారు.
బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 2: కొల్లాపూర్ పట్టణానికి చెందిన రాములు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి శుక్రవారం బాధితుడిని పరామర్శించి ఆరోగ్యపరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట దవాఖాన చైర్మన్ కాటం జంబులయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
సివిల్ దవాఖానకు రూ.3లక్షలు
కొల్లాపూర్, ఏప్రిల్ 2: పట్టణంలోని ప్రభుత్వ సివిల్ దవాఖానలో విద్యుత్, సైడ్ డ్రైన్ నిర్మాణాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.3లక్షలు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సివిల్ దవాఖానలో జరిగిన దవాఖాన అభివృద్ధి సలహా కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే బీరం హాజరై మాట్లాడారు. దవాఖానలో కావాల్సిన వైద్య పరికరాలపై ఎమ్మెల్యే వైద్యాధికారులను అడిగారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్వో వెంకట్దాస్, దవాఖాన అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్ కాటం జంబులయ్య, ఎన్జీవో ప్రతినిధి ఎల్లేని లక్ష్మణ్రావు, ఎంపీడీవో శేషగిరిశర్మ, డాక్టర్లు భరత్రావు, యశ్వంత్రాణి, జయచంద్రప్రసాద్ యాదవ్, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, నాయకులు కిషన్నాయక్, ఖాదర్బాషా, దవాఖాన ఉద్యోగి జీకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
పంటలు ఎండిపోనియ్యం
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 2: రైతులు సాగు చేసుకున్న పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని ముష్టిపల్లి శివారులో డీ3 కెనాల్ను, కల్వకోలు, తీర్నాంపల్లి సమీపంలోని జొన్నలబొగుడ కేఎల్ఐ బ్రిడ్జి కెనాల్ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జగదీశ్వర్రావు, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. కేఎల్ఐ డీ3 కాల్వ నుంచి పెరుమాండ్లపల్లిలోని చివరి ఆయకట్టు వరకూ, కల్వకోలు-తీర్నాంపల్లి శివారు గ్రామాల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వెంటనే సాగునీరు అందించాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటి ద్వారా అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎంపీటీసీ వెంకటస్వామి, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు నాగరాజు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చుడండి
నిరుపేదలకు వరం ‘కల్యాణలక్ష్మి’
టీఆర్ఎస్కు జై కొడుతున్న కుల సంఘాలు
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!