త్రిపురారం, ఏప్రిల్ 2 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కుల సంఘాల నాయకులు జై కొడుతున్నారు. అభ్యర్థి నోముల భగత్కే తమ ఓటు అని ప్రకటిస్తున్నారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లిలో ముస్లిం మైనార్టీలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుడు అనీష్ ముక్తాదర్ మాట్లాడుతూ షాదీ ముబారక్, పింఛన్లు, మైనార్టీ పాఠశాలలు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని పేర్కొన్నారు. నాయకులు ఖలీల్ అహ్మద్, గులాం రసూల్, అమీర్, జమీల్, జాన్వుల్లా, కరీముల్లా, నూర్ మహ్మద్, జాన్బాగ్ పాల్గొన్నారు.
వడ్డెరులంతా టీఆర్ఎస్తోనే…
త్రిపురారం మండలంలోని నీలాయిగూడెం, గంటారావుక్యాంపు, అంజనపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అలమంట హరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామాల్లోని వడ్డెర కులస్తులంతా తమ ఓట్లను కలిసికట్టుగా టీఆర్ఎస్ కారు గుర్తుపై వేసి భగత్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. పల్లపు సైదయ్య, పల్లపు శ్రీను, గజ్జెల ధర్మారెడ్డి, రేపాల నాగయ్య, నారాయణదాసు వెంకటాచారి, వేముల నాగయ్య, వేముల సైదయ్య పాల్గొన్నారు.
ఆరె కటికల ఆత్మీయ సమ్మేళనం..
నందికొండ : గత పాలకులు ఆరె కటికలను గుర్తించలేదని, ఆరె కటికలను గుర్తించి వారికి ప్రాధాన్యత కల్పించినది టీఆర్ఎస్ పార్టేనని ఉప ఎన్నిక నందికొండ ఇన్చార్జి, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. హిల్కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఆరె కటికల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆరె కటికలందరూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్కే ఓటు వేస్తామని తీర్మానించారు. సమావేశంలో ఆరె కటికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డబ్బికార్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోపాల్జీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందరెడ్డి, కటికల సంఘం సభ్యులు సంతోష్, జహంగీర్, నర్సింగ్, శ్రీను, మోహన్లాల్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఉద్యోగంలో చేరిన బ్రిటన్ యువరాజు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
సూపర్మార్కెట్లో బుల్లెట్ల వర్షం
బ్రెజిల్లో కరోనా మరణ మృదంగం.. ఒకే రోజు 3,251 మంది బలి
జాక్ డోర్సే తొలి ట్వీట్.. రూ.20 కోట్లకు విక్రయం