హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలన చేపట్టి 30 నెలలు దాటుతున్నా సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమవుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో తొలి రోజే రూ.7000 కోట్లు రుణ సమీకరణ చేసింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రతి మంగళవారం నిర్వహించే ఓపెన్ మారెట్ ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని సెక్యూరిటీ బాండ్లు పెట్టింది. 13 ఏండ్ల కాలపరిమితితో 7.53 వార్షిక వడ్డీకి రూ.1000 కోట్లు, 18 ఏండ్ల కాలపరిమితితో 7.64 వార్షిక వడ్డీకి మరో రూ.2000 కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో 7.65 వార్షిక వడ్డీకి మరో రూ.2000 కోట్లు, 29 ఏండ్ల కాలపరిమితితో 7.65 వార్షిక వడ్డీకి మరో రూ.2000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) ఇప్పటికే రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేసింది.
రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్) రూ.21,000 కోట్లు అప్పు తీసుకుంటామని ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.7000 కోట్ల రుణ సమీకరణ చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు రూ.25,900 కోట్లకు చేరింది. గత బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణను రూ.54,009 కోట్ల వరకే ప్రతిపాదించినప్పటికీ.. ఒక ఆర్బీఐ నుంచే ఓపెన్ మారెట్ రుణాల రూపంలో రూ.85,840 కోట్లను అప్పుగా తీసుకున్నది. బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది ఏకంగా 158.93 శాతం అధికం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ మొత్తం రూ.80,000 కోట్ల రుణ సమీకరణ చేయాలని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది.
2026-27లో ఆర్బీఐ నుంచి రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్పు ఇలా..
తేదీ మొత్తం