తుంగతుర్తి, ఏప్రిల్2 : కొవిడ్ టెస్ట్లను ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని, అనుమానిత లక్షణాలున్న వారందరూ పరీక్ష చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ప్రజా ప్రతినిధులు డీఎంహెచ్ఓను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ కరోనా టీకా వేయించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగూనాయక్, డాక్టర్ నిర్మల్కుమార్, డాక్టర్ పావని, హెచ్ఈఓ సముద్రాల సూరి, నర్సయ్య, గాజుల సోమయ్య, యాదగిరి, నర్సింహాచారి, తునికి నాగరాజు, గుండగాని రాములుగౌడ్, పులుసు వెంకటనారాయణగౌడ్, గోపగాని శ్రీను పాల్గొన్నారు.
సిబ్బంది సమయ పాలన పాటించాలి
అర్వపల్లి : వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. రోగులకు సరైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల్లో కూడా కరోనా టీకాలు ఉచితంగా వేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట మండల వైద్యాధికారి నవీన్కుమార్, సీహెచ్ఓ చరణ్నాయక్ ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
రోహింగ్యాల క్యాంప్లో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది మృతి
నెట్లో అమ్మకానికి నకిలీ వ్యాక్సిన్, కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
షాకింగ్.. ఫ్రీ లంచ్ కోసం పేర్లు మార్చుకున్న 150 మంది
మనుషులు ఒకప్పుడు మార్స్పై ఉండేవారట.. ఇందులో నిజమెంత?