భద్రాచలం: దక్షిణాది అయోధ్యాపురి భద్రాచలం.. శ్రీసీతారాముల వారి కల్యాణోత్సవానికి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యింది. మరికొద్ది సేపట్లో భద్రాద్రి రాములోరు పెండ్లిపీటలెక్కనున్నారు. బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య పిత్రువాఖ్య పరిపాలకుడి కల్యాణ ఘట్టం జరగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ శ్రీసీతారామచంద్ర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాములవారికి మహాపట్టాభిషేకం జరగనుంది. కరోనా నిబంధనల కారణంగా కల్యాణోత్సవం తిలకించేందుకు అధికారులు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా పూజలు, తీర్థప్రసాదాలను నిలిపివేవారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..