మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
రోడ్డు సుందరీకరణ పనుల పరిశీలన
నిర్మల్ అర్బన్, మే 3 : నిర్మల్ పట్టణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి గాజుల్పేట్ వరకు చేపట్టిన రోడ్డు సుందరీకరణ, అభివృద్ధి పనులను మంత్రి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ చైర్మన్ మాజీ రాంకిషన్ రెడ్డి, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది
కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి, అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను పరిశీలించారు. కొవిడ్ టెస్టుల కోసం వచ్చిన వారితో మంత్రి మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ దవాఖానకు నిత్యం 10 నుంచి 15 ఆక్సిజన్ సిలిండర్లను నిజామాబాద్ నుంచి తీసుకువచ్చి, బాధితులకు అందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. కరోనా బాధితులకు అందిస్తున్న చికిత్సను దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎంహెచ్వో ధన్రాజ్, ఆర్ఎంవో వేణుగోపాల కృష్ణ తదితరులున్నారు.
3057 ఎకరాల్లో పంటనష్టం
సారంగాపూర్, మే 3: వడగళ్ల వానకు 14 గ్రామాల్లో 3057 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మండలంలోని జామ్, మల్లక్చించోలి గ్రామాల్లో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను సోమవారం పరిశీలించారు. సారంగాపూర్ మండలం లో 13, కుంటాల మండలంలోని ఒక గ్రామంలో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇప్పటికే ఏఈవోలు, ఏవోలు, తహసీల్దార్లు, పంటనష్టం అంచనా వేసి నివేదికలు పంపించారని తెలిపారు. నష్టం వివరాలను సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు.స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. కార్యక్రమలో ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, అడెల్లి పోచమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లయ్య, డీఏవో అంజిప్రసాద్, తహసీల్దార్ తుకారాం, ఏవో రాజశేఖర్రెడ్డి, సర్పంచ్లు మురళీకృష్ణ, సుజాత, లస్మయ్య, రాజు, నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజు, ముద్రం దినేశ్ పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, మే 3: జిల్లాలో యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే వంద కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ప్రస్తుతం 13 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యాన్ని వెంట వెంటనే రైస్మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు, పౌర సరఫరాలశాఖ అధికారి కిరణ్కుమార్ పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ
నిర్మల్ రూరల్, సోన్, మామడ మండలాల్లోని 130 మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన రూ. 1.30 కోట్ల విలువైన చెక్కులను నిర్మల్లోని దివ్యగార్డెన్లో లబ్ధిదారులకు మంత్రి అందించారు. కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్లు శ్రీకాంత్, సుభాష్చందర్, ఆరిఫా సుల్తానా, వివిధ మండలాల పార్టీ కన్వీనర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.