సిద్దిపేట: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో కూడా మహమ్మారి బారినపడేవారి సంఖ్య పెరిగిపోతున్నది. దాని ప్రభావం ఇప్పుడు ఆలయాలపై పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది ప్రకటించారు. స్వామివారి లఘు దర్శనం, లడ్డుప్రసాదాల విక్రయం, గదుల నిర్వహణకు అనుమతించడం లేదని తెలిపారు. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ సిబ్బందితో నిర్వహిస్తామని, భక్తులను అనుమతి లేదని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..