(Dundigal Accident) హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కిందపడిన మహిళపై నుంచి భారీ వాహనం పోవడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
ఆదివారం ఉదయం దుండిగల్ కైసర్నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రగతి నగర్ వైపు నుండి మోటార్ సైకిల్పై ఆల్వాల్ వైపునకు వెళ్తున్న థామస్ రెడ్డి , విజయ రాణి (40) దంపతలు కైసర్ నగర్ మసీదు వద్దకు రాగానే అదుపుతప్పి కిందపడిపోయారు. అప్పుడే అటుగా వేగంగా వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ విజయ రాణి తలపై నుంచి దూసుకెళ్లింది. దాంతో విజయరాణి తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. థామస్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..