Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అత్తాపూర్లో శివాని (35) అనే మహిళ బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన శివాని.. దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్వేత ఘటనాస్థలికి చేరుకుని శివానిని 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read..
Salman Khan | సల్మాన్కు మరోసారి బెదిరింపు కాల్.. ఏప్రిల్ 30న చంపేస్తామంటూ..
India Corona | 24 గంటల వ్యవధిలో 5,676 కొత్త కేసులు.. 15 మరణాలు