India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి.
ప్రస్తుతం దేశంలో 37,093 కేసులు యాక్టివ్గా (Active Cases) ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్- 1,932, హరియాణా – 1,928, కర్ణాటక – 1,673, ఉత్తర్ ప్రదేశ్లో 1,282 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,42,00,079 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో (Positive Cases) 0.08 శాతం యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,23,885) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Agriculture | వానకాలం పంటలు వేసేముందు ముందు ఇలా చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చు
Telangana | పశుపక్ష్యాదులకూ అంతిమ సంస్కారాలు.. వైకుంఠధామాల తరహాలో వాటికలు.. ఆ ఎంపీవో ఆలోచన భేష్
Hyderabad | సిటీలో మరో 4 సైక్లింగ్ ట్రాక్లు.. ఏ ఏరియాల్లో అంటే..