Hyderabad | సిటీబ్యూరో , ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఆర్ఎంపీ ( కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్) రోడ్లలో ట్రాక్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు కూకట్పల్లిలో మూడు చోట్ల సికింద్రాబాద్ జోన్లో ఒక చోట సైక్లింగ్ ట్రాక్ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ. 5.48 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పనులన్నీ వచ్చే నాలుగు నెలల్లోగా పూర్తి చేసి ఈ ట్రాక్లను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
సైక్లింగ్ ట్రాక్లు ఇక్కడే..