నారాయణపేట : ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని మరికల్ మండలంల ఎలిగండ్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రైతు వడ్డె కొండల్ వ్యవసాయ పొలంలో పత్తి విత్తనాలు విత్తే పని ముగించుకొని తిరిగి గ్రామానికి ట్రాక్టర్ లో వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా..ఐదుగురు గాయపడ్డారు. పొలం నుంచి గ్రామానికి వస్తుండగా అదుపుతప్పి కోయిల్ సాగర్ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది.
ట్రాక్టర్ లో ఉన్న వడ్డె జయమ్మ (52), వడ్డె సత్తెమ్మ (52) అక్కడికక్కడే మృతి చెందారు.
వడ్డె ఆంజనేయులు, అనసూయ, మహేశ్వరి, నబీబ, లలితకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మరికల్ దవాఖానకు తరలించారు. గాయపడిన వారెవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత