సుల్తానాబాద్ : బైక్ అదుపు తప్పి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం సుద్దాలలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మచ్చ రాకేష్ (25) అనే యువకుడు సోమవారం రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో సుద్దాల శివారులో బైక్ అదుపు తప్పి కిందపడటంతో గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ దావాఖానకు తరలిం చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాకేష్ మంగళవారం మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి..
Mulugu | మల్లూరు శివాలయంలో చోరీ..వెండి కిరీటాలు ఎత్తుకెళ్లిన దుండగులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు