యాదాద్రి, ఏప్రిల్27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్ర పూజల కోలా హలం నెలకొంది. నరసింహుడి జన్మ నక్షత్రాన్ని పురస్కరిం చుకొని ఆలయ అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతఘ టాభిషేకం నిర్వహించారు. ఉదయం బాలాలయంలో సు ప్రభాతం చేపట్టిన అర్చకబృందం వైష్ణవ సంప్రదాయ ప్రకా రం పంచ నారసింహులను మేల్కొలిపి హారతి నివేదన జరి పారు. తులసీ పత్రాలతో అర్చన చేపట్టారు. నరసింహుడి జన్మనక్షత్రం సందర్భంగా స్వామివారి ఆస్థానంలో శతకల శాలను ఏర్పాటు చేసి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగుతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల న డుమ నరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిం చారు. సహస్రనామాలతో అష్టోత్తరం, భక్తులకు దర్శనమి చ్చే కవచమూర్తులకు స్వర్ణపుష్పార్చన జరిపారు. కరోనా నుంచి సకల జనులకు విముక్తి కలిగించాలంటూ అర్చకు లు పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రద క్షిణలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.
స్వామివారికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు
బాలాలయం ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకు ని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగా యి. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అ ర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంట లకు నిర్వహించిన సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హో మం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్స వంలో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరుల ను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊ రేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సు మారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు.
వైభవంగా క్షేత్రపాలకుడికి ఆకుపూజ
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్షేత్రపాలకుడైన ఆం జనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రా నికి పాలకుడిగా చెంతగల గుడిలో హనుమంతుడిని సిం దూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. లలితాపారాయణం చేశారు. స్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఖజానాకు రూ. 3,19,473 ఆదాయం
లక్ష్మీనరసింహస్వామివారి ఖజానాకు రూ.3,19,473 ఆ దాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్ర ధాన బుకింగ్ ద్వారా రూ. 24,998, రూ. 100 దర్శనా లతో రూ. 3,000, సుప్రభాతం ద్వారా రూ. 300, కైంక ర్యాలతో రూ. 600, ప్రచారశాఖ ద్వారా రూ. 1,000, క్యా రీబ్యాగులతో రూ. 550, వ్రతాలతో రూ. 8,000, కల్యాణ కట్టతో రూ. 7,440, ప్రసాద విక్రయాలతో రూ. 1,14, 750, వాహనపూజలతో రూ. 4,200, టోల్గేట్ ద్వారా రూ. 440, అన్నదాన విరాళంతో రూ. 651, సువర్ణ పుష్పా ర్చనతో రూ. 12,568, యాదరుషి నిలయంతో రూ. 18, 500, పాతగుట్టతో రూ. 4,660, టెంకాయల విక్రయా లతో రూ. 16,500 తో కలిపి స్వామివారికి రూ. 3,19,4 73 ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.