జోగులాంబ గద్వాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఓ తండ్రి కన్న కొడుక్కి విషమిచ్చి కిరాతకంగా చంపాడు. ఈ విషాద సంఘటన కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నందిన్నె గ్రామానికి చెందిన కురువ కర్రెప్పకు కుచినెర్ల గ్రామానికి చెందిన నరసమ్మతో వివాహమైంది. వీరికి ఏడాది బాబు భరత్ ఉన్నాడు. కాగా, భార్య ఇంట్లో ఉండగా కొడుకును తండ్రి తన వెంట తీసుకొని వచ్చి చిన్నారికి పురుగుల మందు తాపి భార్య దగ్గర వదిలి వెళ్లాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాబును రాయచూర్ హాస్పిటల్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కర్రెప్పపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు: రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి
Electric shock | కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్రావు