శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం మాతంగి కనకయ్య (70) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..కాచాపూర్ గ్రామానికి చెందిన కనకయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు చనిపోవడంతో కనకయ్య కోడలు కొమురమ్మ ఆమె అక్క కొడుకు ప్రవీణ్ తో కలిసి ఉంటున్నాడు.
కనకయ్య కూతురు లక్ష్మి కూడా ఇదే గ్రామంలో ఉంటోంది. కాగా, ప్రతి రోజు ఉదయం కూతురు ఇంటికి వెళ్లి టీ తాగే అలవాటు ఉన్న కనకయ్య ఆదివారం ఉదయం తన గది నుంచి బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కూతురు వెళ్లి చూడటంతో మంచంపై విగత జీవిగా పడి ఉన్నాడు. అతని శరీరంపై గాయాలు ఉండటంతో హత్యకు గురైనట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
తన తండ్రిని తమ మరదలు (కనకయ్య కోడలు) ఆమె అక్క కొడుకు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ కనకయ్య కూతురు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, శంకరపట్నం ఎస్ఐ ప్రశాంత్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కూకట్పల్లిలో రేవ్ పార్టీ భగ్నం..44 మంది యువకులు అరెస్ట్
Crime news | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైన ఇసుక లారీ
పూలే ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి