జయశంకర్ భూపాలపల్లి : ఇసుక లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి దగ్ధమైన ఘటన కాటారం మండల కేంద్రంలోని బావని వాగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. (టీఎస్ 02యూబీ 9986) నెంబరు గల లారీ ఇసుక లోడ్ చేసుకొని వరంగల్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డు కిందకి దూసుకెళ్లింది.
దీంతో విద్యుత్ వైర్ తెగి లారీకి తగలడంతో ఇసుక లారీ దగ్ధమైంది. అయితే లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకొని దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా, ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీనివాస్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కూకట్పల్లిలో రేవ్ పార్టీ భగ్నం..44 మంది యువకులు అరెస్ట్
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష
పూలే ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి