సిద్దిపేట : జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో గల రంగనాయకసాగర్ రిజర్వాయర్లో సెల్ఫీ దిగుతూ నీటిలో పడి గల్లంతైన విద్యార్థి కార్తీక్ (16) మృతదేహం శనివారం లభ్యమైంది. చిన్నకోడూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన వెగ్గలం కార్తీక్ తోటి స్నేహితులతో కలిసి గురువారం రంగనాయకసాగర్ రిజర్వాయర్ను తిలకించడానికి వెళ్లాడు. సెల్ఫీదిగుతూ అందులో పడిపోయాడు.
కార్తీక్ కోసం గజ ఈతగాళ్లు, పాత గరిగెతో శుక్రవారం గాలించగా ఆచూకీ దొరకలేదు. శనివారం మరోమారు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
జోడేఘాట్ను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్లు
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..