మెదక్ : ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని ఒకరు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకలి పర్శరాములు (32) రామాయంపేట నుంచి బైక్పై తన స్వగ్రామం ఆర్.వెంకటాపూర్ గ్రామానికి వెళ్తుండగా..ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నాడు.
ఈ ప్రమాందలో పర్శరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.