పెద్దపల్లి : దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్ సీఎం కేసీఆర్ రూ.3,016పెంచారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి లక్ష్మీ రాజం, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..