ములుగు : గ్రావిటీ కెనాల్ కింద పంట పొలాలను నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం కేశవపురం గ్రామం వద్ద నిర్మించిన రామప్ప సరస్సు నుంచి గణపురం చెరువులోకి గ్రావిటీ కెనాల్ ద్వారా గోదావరి నీటి తరలింపును ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ.10 కోట్ల నిధులతో నిర్మించిన గ్రావిటీ కెనాల్ ద్వారా రామప్ప సరస్సు నుంచి గణపురం చెరువులోకి దేవాదుల ప్రాజెక్టు లో భాగంగా గోదావరి నీటిని తరలించేందుకు శనివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు.
రైతులకు న్యాయం చేకూర్చేలా సీఎం కేసీఆర్ తో మాట్లాడి ప్రత్యేక నిధులను కేటాయించి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చర్యలు చేపడతామన్నారు.