న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఉన్న క్రిమినల్ విచారణను ఆయన మరణించిన రెండేండ్ల తర్వాత సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. దర్యాప్తు సంస్థ ముగింపు నివేదికలను తిరస్కరించి విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీచేసిన 2015 నాటి ప్రత్యేక సీబీఐ కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మన్మోహన్ సింగ్ అప్పీల్ను అనుమతిస్తూ సీబీఐ నిర్ధారణలను తిరస్కరించడానికి లేదా ఆయనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి బలమైన కారణాలు ఏవీ లేవని కోర్టు పేర్కొంది. ఈ కేసు యూపీఏ ప్రభుత్వ హయాంలో తలబీర-2 బొగ్గు బ్లాక్ కేటాయింపునకు సంబంధించినది.