వరంగల్ రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ శివారులోని వాగులో పడి పోచంపల్లి వినయ్ కుమార్ రెడ్డి (22) మృతి చెందాడు. ఇదే మండలంలోని వరికోల్ గ్రామానికి చెందిన వినయ్ కుమార్ రెడ్డి వాగు వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడు.
శాయంపేట సీఐ రమేష్ కుమార్, దామెర ఎస్ఐ భాస్కర్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి పరీక్షలు చేయండి
గంగానది ఇసుకతిన్నెల్లో బయటపడ్డ శవాలు