మైసూరు : కర్ణాటకలోని మైసూరు నగరంలో ఒక కళాశాల విద్యార్థిపై సామూహిక లైంగికదాడి (Gang Rape) జరిగింది. దుండగులు ఆ యువతి ప్రియుడిని కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగ్గా.. బుధవారం సాయంత్రానికి కేసు నమోదైంది. నిందుతులు పరారీలో ఉన్నారు. నేరస్థులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ ఆదేశించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైసూర్ నగరంలోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థిని మంగళవారం రాత్రి 7.30 గంటలకు తన ప్రియుడితో కలిసి చాముండి హిల్స్ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్నది. ఈ సమయంలో అటుగా వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిని చుట్టుముట్టి తీవ్రంగా కొట్టి డబ్బులు లాక్కొన్నారు. అనంతరం యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడే చనిపోయాడు. యువతి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం బాధితురాలు స్థానిక దవాఖానలో కోలుకుంటున్నదని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
మైసూరు పోలీసు కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు కోసం పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నేరస్థులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రవీణ్ సూద్ని ఆదేశించినట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరస్థులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు మైసూరు, బెంగళూరులో గాలిస్తున్నాయని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. పెరుగనున్న పెన్షన్
తండ్రీకొడుకుల మోసం.. 157 కోట్లు ముంచారు..
త్వరలో భారత్కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ
అమెరికాను అధిగమించిన భారత్.. దేనిలోనంటే..?
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్కు 412 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..