వాషింగ్టన్ : మోసం చేయాలనే బలమైన కోరిక ఉంటే.. అది ఎక్కడైనా, ఏ విధంగానైనా చేస్తుంటారు. దానికి దోస్తులే కానక్కరలేదు. తండ్రీకొడుకులైనా చేసేయగలరు. అచ్చం ఇలాంటి కేసు ఒకటి అమెరికాలోని మసాచుసెట్స్లో బయటపడింది. చిన్నారులకు సాయం పేరుతో వేలాది లాటరీ టిక్కెట్లపై తండ్రీకొడుకులు (Lottery Scam) పన్ను ఎగవేశారు. ఎనిమిదేండ్లుగా తమ మోసాలను నిరాటంకంగా కొనసాగించి జల్సాలు చేశారు. ఈ సమయంలో వారు దాదాపు రూ.157 కోట్ల మేర మోసం చేశారంటే.. వారి దొంగ బుద్ధిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇటీవలనే ఈ కేసు కోర్టు దాకా వచ్చింది.
అమెరికాలోని మసాచుసెట్స్లో నివసించే అలీ జాఫర్, అతడి కుమారులు మొహమ్మద్, యూసుఫ్.. చిన్నారులకు సాయం పేరుతో లాటరీ విజేతల నుంచి టిక్కెట్లు తీసుకునేవారు. విజేతలకు కొంత మినహాయించుకుని నగదు చెల్లించేవారు.ఇలా ఎనిమిదేండ్లలో వారు దాదాపు 13,000 కంటే ఎక్కువ లాటరీ టిక్కెట్లను నగదు చేసుకుని తండ్రీకొడుకులు.. పిల్లలకు సహాయం పేరుతో పన్నులు, ఇతర మినహాయింపులను ఎగవేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై రూ.157 కోట్ల మేర మోసం చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు మసాచుసెట్స్లోని యూఎస్ జిల్లా కోర్టులో జాఫర్, అతని కుమారులపై 19 పేజీల ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇందులో వీరిపై మనీలాండరింగ్, పన్ను ఎగవేతకు సంబంధించి డజనుకు పైగా కేసులు ఉన్నాయి.
త్వరలో భారత్కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ
అమెరికాను అధిగమించిన భారత్.. దేనిలోనంటే..?
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్కు 412 ఏండ్లు
మర్మాంగానికి సీల్.. యువకుడు మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..