అమృత్సర్ : పాకిస్తాన్ సరిహద్దులోని అత్తారీ వద్ద విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాను (BSF Jawan Suicide) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీఓపీ ధరివాల్ పోస్ట్లో విధుల్లో ఉన్న అతడు తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని 32 ఏండ్ల చందన్ కుమార్ సింగ్గా గుర్తించారు. ఆయన బిహీర్లోని బంకా జిల్లాలోని గుల్ని కుషా గ్రామానికి చెందినవాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చందన్ కుమార్ మరణవార్త తెలియగానే ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని త్వరగా గ్రామానికి రప్పించేందుకు బిహార్ ప్రభుత్వం కృషిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
బిహార్ బంకా జిల్లాలోని గుల్ని కుషా గ్రామానికి చెందిన చందన్ కుమార్ సింగ్.. ఐదేండ్లుగా బీఎస్ఎఫ్లో జవానుగా పనిచేస్తున్నారు. పంజాబ్ శివార్లలోని బీఓపీ ధరివాల్ పోస్ట్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, మంగళవారం సాయంత్రం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతదేహానికి ఇవాళ పోస్ట్మార్టం జరుగనున్నది. ఆయన మరణానికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. అయితే, బీఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఆయన మరణంపై విచారణ ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన మృతదేహాన్ని గుల్ని కుషా గ్రామానికి తరలించనున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చందన్ కుమార్ సింగ్కు ఇద్దరు సోదరులు ఉన్నారు.
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్కు 412 ఏండ్లు
జేమ్స్ బాండ్ మ్యూజిక్తో అలరించిన ముంబై పోలీసులు
మర్మాంగానికి సీల్.. యువకుడు మృతి
ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..