న్యూఢిల్లీ : అమెరికాను భారతదేశం అధిగమించి ప్రపంచంలోనే రెండో (India Second) అత్యంత ఆకర్శణీయమైన తయారీ కేంద్రంగా నిలిచింది. పని వాతావరణం, వ్యయ పోటీతత్వం కారణంగా భారతదేశం ఈ స్థానాన్ని సాధించింది. ఇదేకాకుండా, భారతదేశం ఔట్సోర్సింగ్ అవసరాలను కూడా నెరవేర్చింది. ఈ విభాగంలో కూడా ర్యాంకింగ్ మెరుగుపడింది.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ కుష్మన్ & వేక్ఫీల్డ్ విడుదల చేసిన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్-2021 ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన తయారీ కేంద్రంగా చైనా ఉన్నది. ఒక స్థానం ఎగబాకి, రెండో స్థానానని భారతదేశం హస్తగతం చేసుకున్నది. గత ఏడాది నివేదికలో, అమెరికా రెండవ స్థానంలో, భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి.
యూరప్, అమెరికా, ఆసియా-పసిఫిక్లోని 47 దేశాల్లో తయారీకి ఆకర్షణీయమైన ప్రదేశాలను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం, అమెరికాకు మూడవ స్థానం, కెనడా నాల్గవ, చెక్ రిపబ్లిక్ ఐదవ, ఇండోనేషియా ఆరవ, లిథువేనియా ఏడవ, థాయ్ల్యాండ్ ఎనిమిదవ, మలేషియా తొమ్మిదవ, పోలాండ్ పదవ స్థానంలో ఉన్నాయి. అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలతో పోలిస్తే చాలా మంది తయారీదారులు భారతదేశంలో తమ కంపెనీలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
భారతదేశంలో తయారీ రంగంలో మొత్తం కంపెనీల్లో తయారీ కంపెనీల వాటా 20 శాతంగా ఉన్నది. అయితే, జూలై నెలలో వీరి వాటా 21 శాతానికి పెరిగింది. గత నెలలో దేశంలో మొత్తం 15,499 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో 21 శాతం అంటే 3,217 కంపెనీలు తయారీకి సంబంధించినవే ఉన్నాయి.
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్కు 412 ఏండ్లు
మర్మాంగానికి సీల్.. యువకుడు మృతి
ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..