న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ (Bank Pensions) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేబశీష్ పాండా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్లో పెన్షన్ పొందుతారు. దాంతో ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ కాస్తా రూ.30,000-35,000కు పెరుగనున్నది.
ఇంతకుముందు వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్ను ఎలాంటి ఫిక్స్డ్ క్యాప్ లేకుండా మెరుగుపరచాలని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రభుత్వానికి నివేదించింది. దాంతో వేలాది బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఈ సిఫార్సును ఆమోదించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇదే సమయంలో, పెన్షన్ కార్పస్లో యజమాని సహకారాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. దీంతో కరోనా సమయంలో మరణించిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు అందుతున్న పెన్షన్ 30 శాతం పెరిగింది. ఇది మరణించిన ఉద్యోగి చివరి జీతం ఆధారంగా జరిగింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును సమీక్షించారు. డిమాండ్ సృష్టించడానికి, వినియోగాన్ని పెంచడానికి బ్యాంకింగ్ పరిశ్రమ సాధించిన పురోగతి గురించి చర్చించడానికి ఆమె వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను కలిసింది. ‘ప్రభుత్వరంగ బ్యాంకులు సమిష్టిగా బాగా పనిచేశాయి. కరోనా మహమ్మారి సమయంలో సేవలను పొడిగించినప్పటికీ సత్వర దిద్దుబాటు చర్య నుంచి బయటపడ్డాయి’ అని నిర్మలమ్మ చెప్పారు. కాగా, గత నెల నుంచే బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 27.79 శాతానికి కేంద్రం పెంచింది.
తండ్రీకొడుకుల మోసం.. 157 కోట్లు ముంచారు..
త్వరలో భారత్కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ
అమెరికాను అధిగమించిన భారత్.. దేనిలోనంటే..?
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్కు 412 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..