కుమ్రంభీం ఆసిఫాబాద్ : అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఎస్.కే షాబీర్ అనే వ్యక్తి నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే విశ్వసనీయ సమాచారం మేరకు అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అమ్మకానికి నిలువ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ సుమారు రూ. 1,36,000 విలువ ఉంటుందని సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాణాప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఎస్.ఐ ప్రసాద్, సత్తార్, కానిస్టేబుల్ మధు, తిరుపతి, సంపత్, సంజయ్, రమేష్, విజయ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు