భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలో మరోమారు భారీగా 1,005 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2కోట్లపైనే ఉంటుంది. మూడేళ్ల కాలంలో తరచూ భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయిని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సారి వినూత్నంగా మొక్కల మాటున భారీ ఎత్తున గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు ప్లాన్ వేశారు. భద్రాచలం పోలీసులు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మంగళవారం మధ్యాహ్నం పట్టణ సీఐ టీ స్వామి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై మధుప్రసాద్ అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో (RJ17GA307) అనే నెంబర్ గల లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో లారీని ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి భారీ ఎత్తున 1,005 కేజీల పట్టుబడింది.
దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. లారీలో ఉన్న వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం అగర్ జిల్లా దండం గ్రామానికి చెందిన సత్యనారాయణ, కరణ్ సింగ్గా గుర్తించామన్నారు. వీరు గంజాయిని సీలేరు వద్ద అటవీప్రాంతం నుంచి మధ్యప్రదేశ్కు తరలిస్తున్నారని చెప్పారన్నారు.
సీలేరు వద్ద ఒడిశా ప్రాంతానికి చెందిన వసీం అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి మధ్యప్రదేశ్లోని ఈశ్వర్ సింగ్, ప్రేమ్సింగ్ వద్దకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. సమావేశంలో మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరీష్, పట్టణ సీఐ స్వామి, ఎస్సై మధుప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈటల తాయిలాల పంపిణీ పై తిరగబడ్డ యువత (వీడియో)
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
దారి దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్