హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావును హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. అంబర్పేటలోని హనుమంతరావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా చికిత్స పొందిన హనుమంతరావు ఇటీవలనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జయ్యారు.