వరంగల్ రూరల్ : ఓ యువతిపై జరిగిన దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1.66 లక్షల విలువ చేసే బంగారు నగలను ఆత్మకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడ్ జంక్షన్ వద్ద పరకాల వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న ఓ యువతిని.. గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన జి. రాకేష్ లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన తవేరా వాహనంలో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో వాహనం ఆపి ఆమెను గాయపరిచి యువతి ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకొని ముళ్లపొదల వద్ద పడేసి పారిపోయాడు.
కేకలు విన్న స్థానికులు బాధితురాలిని దవాఖానకు తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాకేశ్, అతను ఉపయోగించిన వాహనాన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి తవేరావాహనం, దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఈటల తాయిలాల పంపిణీ పై తిరగబడ్డ యువత (వీడియో)
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్