శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణం చేస్తారు. చివరి రోజైన నేడు స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి అమ్మవారికి నిజాలంకరణ చేస్తారు. అశ్వవాహన సేవ అనంతరం పార్వతీపరమేశ్వరులకు పుష్పోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు కల్యాణోత్సవం ఉంటుంది. అనంతరం ఏకాంతసేవ నిర్వహిస్తారు. శయనోత్సవం, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..