జడ్చర్ల/మహబూబ్నగర్ : పండుగ కోసం వచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఉన్న ఊర్లో సంబురంగా పండుగను చేసుకుందామనుకుని వచ్చిన వారి పాలిట విధి వక్రించింది. విద్యుత్ షాక్తో కుటుంబ పెద్ద మరణించడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే..జడ్చర్ల మండలం వల్లూరు గ్రామ శివారులోని తుమ్మల కుంట తండాలో ఇస్లావత్ కృష్ణ నాయక్(48) అనే వ్యక్తి ఇంట్లో కరెంట్ బల్బ్ బిగించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కృష్ణ హైదరాబాద్లో కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పోచమ్మ పండుగ కోసం భార్య, పిల్లలతో కలిసి నిన్న తండాకు వచ్చాడు.
ఇంటిని శుద్ధి చేసి కరెంట్ బుగ్గను పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో మృతిచెందాడు. కృష్ణ మృతితో తండాలో విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనతో తండాలో పోచమ్మ పండుగను వాయిదా వేసుకున్నారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుడి కుటుంబాన్ని గ్రామస్తులు పరామర్శించారు.
ఇవి కూడా చదవండి..
డయల్ 100తో తక్షణ స్పందన..బాలుడిని తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు