Heart Attack | ఒడిశా (Odisha)లో విషాద ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ (Bus Driver) గుండెపోటు (Heart Attack) బారిన పడ్డాడు. అయితే, ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సదరు డ్రైవర్.. చివరికి తుది శ్వాస విడిచాడు.
ఈ ఘటన బాలాసోర్ (Balasore) జిల్లాలోని పటాపూర్ చక్ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పశ్చిమబెంగాల్ నుంచి ప్రయాణికులతో బాలాసోర్ జిల్లాలోని పంచలింగేశ్వరాలయం వైపు వెళ్తోంది. అయితే మార్గం మధ్యలో డ్రైవర్కు ఛాతీలో నొప్పి మొదలైంది. దీంతో మరింత దూరం బస్సును నడపలేనని ముందుగానే గ్రహించిన డ్రైవర్.. రోడ్డుపక్కన బస్సును ఆపేశాడు. అనంతరం స్పృహ కోల్పోయి పడిపోయాడు.
ఆ సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను షేక్ అక్తర్గా గుర్తించారు. అనంతరం అతడిని నీలగిరి సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read..
Suriya Jyothika | ఫిన్లాండ్ వెకేషన్లో జ్యోతిక – సూర్య దంపతులు.. మంచులో ఆటలు.. క్యూట్ వీడియో
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పదేళ్లు జైలు శిక్ష