మనోహరాబాద్, మే 26 : మనోహరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కొనాయిపల్లి పీటీ, కాళ్లకల్ తదితర గ్రామాల్లో రెండో విడుత ఆరోగ్య సర్వేను బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు ఇతర సమస్యలతో ఉన్న వారిని గుర్తించి మందులను పంపిణీ చేశారు. కాళ్లకల్లో నిర్వహించిన సర్వేను మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రాజుయాదవ్, నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
శివ్వంపేటలో…
ఆరోగ్య తెలంగాణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. శివ్వంపేట మండలం శభాష్పల్లిలో మండల వైద్యాధికారిణి భవాని, ఎస్సై రమేశ్లతో కలిసి ఇంటింటి సర్వేను నిర్వహించారు. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులపై వివరాల ను సేకరించి, మందులను పంపిణీ చేశారు. సర్పంచ్ పార్వతిసత్యం ముదిరాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్ మండలంలో…
చిలిపిచెడ్,మే 26: మండలంలో కొనసాగుతున్న రెండో విడుత ఇంటింటి ఆరోగ్య సర్వేను ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీవో శశిప్రభ పరిశీలించారు. బుధవారం మండలంలోని చిలిపిచెడ్, జగ్గంపేట, గౌతాపూర్, సోమ్లా తండాలో ఆరోగ్య సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకొని మందులు పంపిణీ చేశామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారికి మందుల కిట్టు అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
నార్సింగిలో
చేగుంట,మే26: గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్యసిబ్బందికి తెలుపాలని నార్సింగి మండలప్రత్యేక అధికారి జగదీశ్ పేర్కొన్నారు. నార్సింగిలో రెండో విడుత నిర్వహిస్తున్న జ్వరం సర్వేను పరిశీలించారు. అం దరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తెంగాణ ప్రభు త్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, ఎంపీవో సతీష్, ఆశ కార్యకర్త, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
రేగోడ్లో…
రేగోడ్, మే 26: మండలంలో జ్వర సర్వే కొన సాగింది. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి వివరాలు సేకరించారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారికి వెంటనే మందుల కిట్టును అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ సుమంత, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వినోద్కుమార్, గ్రామకార్యదర్శి రాము లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
మెదక్ మండలంలో
మెదక్రూరల్ మే26: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న జ్వర సర్వే ఉత్తమ ఫలితాలను ఇస్తున్నదని చిట్యాల సర్పంచ్ వెంకటేశం అన్నారు బుధవారం మెదక్ మండలంలోని సంగాయిగుడ, చిట్యాల అయా గ్రామాల్లో ఇంటింటా ఏఎన్ఎం అవీలా పంచాయతీ కార్యదర్శి చైతన్య పర్యటిస్తూ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై రెండో విడుత సర్వే చేశారు . తండాల్లో జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి కరోనా కిట్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ సిబ్బంది. నవనీత, అంజిబాయి ఉన్నారు.