నారాయణరావుపేట, మే 4: ‘సిద్దిపేట ఉద్యమాల ఖిల్లా… రేవంత్రెడ్డి ఇకడ నీ పప్పులు ఉడకవు..లిల్ల్లీపుట్ రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి మొరిగిండు… నేను నీ కొడంగల్ వచ్చి నిన్ను ఓడగొట్టిన బిడ్డా… కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక సిద్దిపేటను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వానికి ధరలు పెంచడం తప్ప పేదల సంక్షేమం పట్టదన్నారు.
సిద్దిపేట అభివృద్ధి బీజేపోళ్లకు గిట్టదు…
బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు సిద్దిపేట అభివృద్ధి ఓర్వలేని వ్యక్తి హరీశ్రావు అన్నారు. బీజేపీ నాయకులు ఇంటింటా క్యాలెండర్లు పంచుతున్నారని, క్యాలెండర్లు కడుపు నింపుతాయా అని ప్రశ్నించారు. ఐదు నెలల్లోనే ప్రజలు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చిందా అని ప్రశ్నించారు. రూ.4000 రూపాయల పింఛన్ వస్తే కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లను హరీశ్రావు కోరారు. బీడీ కార్మికులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పుర్రె గుర్తును తెస్తే, బీజేపీ బీడీలపై జీఎస్టీ విధించిందన్నారు. రేవంత్రెడ్డి జిల్లాలను రద్దు చేస్తానని చెబుతున్నాడని, మొదట సిద్దిపేట జిల్లాను రద్దు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా రద్దుచేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజ్ని రేవంత్రెడ్డి గద్దలా కొడంగల్ ఎత్తుకుపోయాడని, కారు గుర్తుకు ఓటువేసి రేవంత్రెడ్డి గూబ గుయ్యుమనేలా తీర్పునివ్వాలని ప్రజలకు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. నారాయణరావుపేట తనకు, కేసీఆర్ ఉన్న ప్రేమ ఇంకెవరికైనా ఉంటుందా అన్నా రు.
మీరు పిలిస్తే వచ్చే హరీశ్ అన్న ఉండగా బీజేపీ, కాంగ్రెస్ ఎందుకన్నారు. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తకువే అని.. నా చివరి శ్వాస వరకు మీకు సేవ చేస్తానని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో భూముల ధరలు పడిపోయాయన్నారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, తెలంగాణను దొంగల పాలు చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో కేసీఆర్పై ఎన్నో దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. 6 గ్యారెంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే నువ్వు రాజీనామా చేస్తావని రేవంత్రెడ్డికి తాను సవాల్ విసిరితే తోక ముడిచి పారిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ తీసుకు రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఎండాకాలంలోనూ నారాయణరావుపేట పెద్ద చెరువు మత్తడి దుంకిందంటే దానికి కారణం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, ఎంపీపీ బాలమల్లు, వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, నాయకులు ఎల్లారెడ్డి, హరీశ్, ఆంజనేయులు, భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.