కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 450 మంది ఉన్న ఈ గురుకులంలో మధ్యాహ్న భోజనంలో క్యాబేజీ, సాంబార్, గడ్లు పెట్టారు. భోజనం చేసిన కొద్ది సేపటికి విద్యార్థినిలకు వాంతులు, కడుపు నొప్పి మొదలైంది.
సుమారు వంద మంది పిల్లలకు ఈ పరిస్థితి ఎదురవడంతో అప్రమత్తమైన గురుకులం సిబ్బందిని వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
తీవ్ర అస్వస్థతకు గురైన 50 మందిని తహసీల్దార్ రజిత, ప్రిన్సిపాల్ స్వాతి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పిల్లల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటు గురుకులంలో కూడా వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా