రంగారెడ్డి: జిల్లా కందుకూరు మండలంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి అనంత లోకాలకు పంపించాడో భర్త. కందుకూరు మండలంలోని దాసర్లపల్లికి చెందిన సారమ్మ, మహేందర్ ముదిరాజ్ భార్యాభర్తలు. దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సారమ్మను గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..