దండేపల్లి/మంచిర్యాల : జిల్లాలోని దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ముత్తె మల్లవ్వ (112) వయోభారంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లవ్వకు ముగ్గురు సంతానం. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వీరిలో కుమారుడు మృతి చెందాడు.
ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె ఎక్కువగా సజ్జ, జొన్న రొట్టె, అంబలి, రాగి ముద్ద, పాలు, పెరుగు తింటూ ఆరోగ్యంగా ఉండేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. మనుమళ్లు, ముని మనమళ్లను కూడా ఆమె చూసిందని వివరుంచారు.
ఇవి కూడా చదవండి..
Cricket : పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Road accident : రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు!
Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్లో 300 పోస్టులు