సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ టెకీ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ అనూష (27) కారు డ్రైవర్ శివ మరో ముగ్గురు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్లు కలిసి కారులో గోవాకు వెళ్లారు. కాగా, వారు తిరిగి వస్తుండగా జిల్లాలోని కోహీర్ మండలం చింతల్ ఘట్ 65 జాతీయ రహదారిపై నిలిచిన లారీని ఢీ కొట్టింది.
అనూష తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.