రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్పందన భార్యాభర్తలు. పెళ్లైన ఆరేండ్ల తర్వాత ఆ దంపతులకు బాబు పుట్టాడు. హెయిర్ కటింగ్ షాప్లో పనిచేస్తున్న విక్రమ్.. మద్యానికి బానిసయ్యాడు. మద్యంమత్తులో రోజూ ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా ఇంట్లో గొడవచేశాడు. ఆవేశంతో ఆరు నెలల పసికందును నీటిసంపులో పడేసి మూతపెట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికిచేరిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..