వాషింగ్టన్, ఏప్రిల్ 6: కార్పొరేట్ ట్యాక్స్ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతాయన్న వాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36 శాతంగా ఉండేదని, ట్రంప్ హయాంలో దీన్ని 21 శాతానికి కుదించారని బైడెన్ గుర్తుచేశారు. ప్రస్తుతం దీన్ని 28 శాతానికి పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇది ఎవరికీ ఇబ్బందులను కలుగజేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
షికాగోలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు