నల్లగొండ: ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవదానం, జ్యోతి దంపతుల కుమారుడు శ్రీకాంత్ (20), అదే గ్రామానికి చెందిన యువతి (19) గత మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలియడంతో.. ఈనెల 19న వారిద్దరు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు.
అయితే తమ కుమార్తెను ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడని, దీంతో తమ పరువు పోయిందని యువతి కుటుంబ సభ్యులు.. శ్రీకాంత్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో అతని తండ్రి దేవదానం మృతి చెందాడు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. యువతి బంధులు దాడిచేయడంతో దేవదానం చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..