జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. బైక్ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గద్వాల పట్టణ సమీపంలోని సంగాల చెరువు దగ్గర చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎర్రమట్టి వీధికి చెందిన నవీన్, ముని భార్యభర్తలు వీరికి అఖిల్(8) అనే కుమారుడు ఉన్నాడు. కాగా, నవీన్ తన భార్యని కస్తూర్బా పాఠశాలలో వదిలి ఇంటికి తిరిగి వస్తున్నాడు.
ఈ క్రమంలో వారి బైక్ను ఓ కారు వెనక నుంచి ఢీ కొనడంతో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఏపీలోని కర్నూలు జిల్లా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి