ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగులో ఆదివారం చిలుక ఐలయ్య (45) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క-సారమ్మల దర్శనానికి వచ్చారు. పుణ్యస్నానాలు చేసేందుకు ఊరట్టం లో లెవల్ కాజ్వే వద్దకు స్నానం చేసేందుకు వాగులో దిగాడు.
లోతును అంచనా వేయలేకపోవడంతోపాటు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఐలయ్య నీటిలో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా జాడ తెలియలేదు. మృతుడి అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Srsp Project : ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ఫ్లో
ఎంగేజ్మెంట్ రింగ్తో స్టార్ క్రికెటర్
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం