నిజామాబాద్ : ఎగువన ఉన్న మహారాష్ట్రతోపాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గోదావరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి 14,800 ఇన్ఫ్లో వచ్చి చేరుతోందన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి ఏడు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందన్నారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1090.80 అడుగుల (89.212టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 288.655 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు. మిగులు జలాలను కాలువలు, గోదావరిలోకి 218.429 టీఎంసీల నీటిని వదిలినట్లు ఏఈఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ సంస్థాగత నిర్మా ణం : మంత్రి సత్యవతి
ఎంగేజ్మెంట్ రింగ్తో స్టార్ క్రికెటర్
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం