సంగారెడ్డి : చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని గుండ్లమచూనుర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శేరి మహేశ్(32) సోమవారం ఇంట్లో నుంచి భయటకు వెళ్లాడు.
రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం తెల్లవారు జామున మృతుడి తండ్రి యాదయ్య గ్రామ శివారులోని పెద్దచెరువు వైపు వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులో గల పెద్దచెరువు తూము వద్ద మహేశ్ మృతదేహం కనిపించింది.
కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెంది ఉండవచ్చు అని స్థానికులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime news |మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబా అరెస్ట్
T20 World Cup | దుబాయ్లో కలిసిన ధోనీ, గేల్.. ఫొటో వైరల్
Singur project | సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద