సంగారెడ్డి : జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్కు వరద ఉధృతి తగ్గింది. కాగా, మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లు ఎత్తి 29,677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిలువ 29.618 టీఎంసీలు ఉంది. సింగూరు ప్రాజెక్టు దిగువన మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు.